TOP NEWS

Thursday, 28 October 2010

సమంత కోసం పాట పాడుతున్న మహేష్‌!



‘మహేష్‌ ఖలేజా’ చిత్రం తర్వాత ప్రిన్స్‌ మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘దూకుడు’. మహేష్‌బాబుకు జోడీగా సమంత నటిస్తున్న ఈ చిత్రాన్ని 14రీల్స్‌ పతాకంపై శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్‌, అనిల్‌, గోపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో భాగంగా ‘గురువారం మార్చి ఒకటి... ఈవినింగ్‌... పడ్డాను నీతో ప్రేమలో....’’ అనే పల్లవితో సాగే మెలోడీ పాటను మహేష్‌, సమంతలపై శోభి నృత్యదర్శకత్వంలో చిత్రీకరిస్తున్నారు. థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పదిహేను రోజుల పాటు అక్కడ కొనసాగుతోంది.

0 comments: